పేర్ని నానిని ఓడించాలని పవన్ డిసైడ్ అయ్యారా!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, స్నేహం ఉండకూడదు. అయితే, కొందరు రాజకీయ నేతలను తాత్కాలికంగానో, శాశ్వతంగానో శత్రువులుగా చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌పై కంటే మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్‌లపైనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎక్కువ ఆగ్రహం ఉంది. ముఖ్యంగా పవన్ బహిరంగంగా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి విమర్శించడం మామూలే.
పవన్ చేసిన ప్రతి వ్యాఖ్యకు పేర్ని నాని నేరుగా కౌంటర్ ఇస్తున్నారు.అదే సామాజికవర్గానికి చెందిన ఆయన కూడా పవన్ అనుచరుల ఆగ్రహానికి గురవుతున్నారు. పేర్ని నాని కౌంటర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ కు అవకాశం దొరికినప్పుడల్లా పేర్ని నానిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో పేర్ని నానిని ఓడించడమే జనసేన లక్ష్యంగా కనిపిస్తోంది. తనను విమర్శించడమే కాకుండా వ్యక్తిగతంగా దూషించే పేర్ని నానిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు. ఈ నెల 14న పేర్ని నాని నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం సృష్టించింది.

Previous article20వ తేదీన హాజరు కావాలని కవితకు ఈడీ మరోసారి నోటీసులు!
Next articleఒంటరి పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి!