ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తల గృహాలు, రాజకీయ నాయకులపై ఐటీ దాడులు జరిగేవి. ఎన్జీవోలు, ప్రజా సంఘాలను టార్గెట్ చేయడం బీజేపీ ప్రభుత్వంలో కొత్త ట్రెండ్. ఈ సంస్థలు బిజెపి ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇటీవల, బిజెపి స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, పరిశోధనా సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. అంతర్జాతీయ నిధుల సంస్థ ఆక్స్ఫామ్కు చెందిన ఢిల్లీ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్,ప్రతిష్టాత్మక థింక్-ట్యాంక్ను లక్ష్యంగా చేసుకుంది. బెంగళూరుకు చెందిన పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ (IPSMF)పై కూడా దాడులు జరిగాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, బిజెపి ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శించే ది కారవాన్, ది ప్రింట్, స్వరాజ్య వంటి అనేక ఆన్లైన్, డిజిటల్ మీడియా అవుట్లెట్లకు IPSMF నిధులు సమకూరుస్తుంది. అయితే, దాడి చేసిన సంస్థ, సంస్థలు దాడులపై ఎటువంటి బహిరంగ ప్రకటనలను విడుదల చేయలేదు. ఐటీ శాఖ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
2002 గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన నివేదికను కూడా IMSMf విమర్శించింది. సంస్థ యొక్క ట్రస్టీలలో ప్రముఖ పాత్రికేయుడు టిఎస్ నివాస్. ఈ సంస్థకు నటుడు అమోల్ పాలేకర్ ట్రస్టీగా ఉన్నారు. దాతలలో విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్జీ,నందన్ నీలేకని ఉన్నారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థకు లేడీ శ్రీరామ్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ మీనాక్షి గోపీనాథ్ నేతృత్వం వహిస్తున్నారు. బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే అనేక సంస్థలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది.1973లో బెంగళూరులో ఈ సంస్థ ఏర్పాటైంది.