తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ పార్టీని తెరపైకి తెచ్చి మీడియాకు లీక్ చేసి చర్చకు తెరలేపిన తర్వాత మరోసారి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ను కొనసాగిస్తారా, భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)ని ప్రత్యేక రాజకీయ పార్టీగా ఆవిష్కరిస్తారా? లేక టీఆర్ఎస్ని బీఆర్ఎస్లో భాగస్వామ్యం చేస్తారా? కేసీఆర్ ఏం చేయబోతున్నాడో తెలియని అయోమయంలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
ఒక జాతీయ మీడియా కథనం ప్రకారం, బీఆర్ఎస్ యొక్క నిర్మాణం, కూర్పు ఏమిటి ముఖ్యమంత్రి ఎలాంటి నమూనాను అనుసరించబోతున్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 1977లో చేసిన జనతా పార్టీ ప్రయోగం తరహాలో కేసీఆర్ తన జాతీయ పార్టీకి కన్సార్టియం నమూనాను అనుసరించే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిని ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదిక పేర్కొంది.
జనతా పార్టీ ప్రత్యేక జాతీయ పార్టీగా నమోదు చేయబడినప్పటికీ, ఇది భారతీయ జన్ సంఘ్,జనతా మోర్చా, భారతీయ లోక్ దళ్, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీలతో సహా వివిధ స్వతంత్ర రాజకీయ పార్టీల సమ్మేళనం అని నివేదిక పేర్కొంది. కాబట్టి, వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల కలయికతో కేసీఆర్ ప్రతిపాదించిన బీఆర్ఎస్ కూడా జనతా పార్టీ తరహాలో ఉండే అవకాశం ఉంది.
ఇది టిఆర్ఎస్తో సహా వివిధ సారూప్య పార్టీలు, ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సూరజ్, రాకేష్ టికైత్కు చెందిన భారతీయ కిసాన్ యూనియన్ వంటి సంస్థలు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో సహా వ్యక్తులతో కూడిన కన్సార్టియం కావచ్చు” అని నివేదిక పేర్కొంది.
ఒకవేళ కేసీఆర్ ఈ కన్సార్టియం నమూనాను అవలంబించినా, ఆయనకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్లో విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదు. తెలంగాణలో ఒకటి, జాతీయ స్థాయిలో మరొక పార్టీ ఉండకూడదు. కేసీఆర్ నడిపే పార్టీ ఒక్కటే ఉండాలి లేకుంటే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది అని నివేదిక పేర్కొంది.బీఆర్ఎస్ ప్రత్యేక పార్టీగా ఉండి, టీఆర్ఎస్ను కొనసాగిస్తే, కేసీఆర్కు ఉమ్మడి గుర్తు, ఎజెండా ఉండవు. బీఆర్ఎస్ తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేయకూడదు, కానీ ఇతర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలి. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే కేసీఆర్ తెలంగాణతో గుర్తింపు పొందారు.