ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ వెనుకబడిన తరగతుల ప్రజలు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. వివిధ కారణాలతో వారు టీడీపీలో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2019లో జగన్ వేవ్లోనూ టీడీపీ ఆ సీట్లు గెలుచుకున్నది బీసీల వల్లే.. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీలకు కేబినెట్లో ఎక్కువ వాటా ఇచ్చారు. కొత్త క్యాబినెట్ ప్రయోగంతో వచ్చే ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్ కాంగ్రెస్కే ఓట్లు వేస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
బీసీలకు కేబినెట్లో ఎక్కువ స్థానం కల్పించినందుకే బీసీలు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లోకి వెళతారా ? లేక టీడీపీకి విధేయత చూపిస్తారా ? అనేది చూడాలి. ప్రతిపక్ష టీడీపీ గత 40 ఏళ్లలో అనేక మంది బీసీ నేతలను తయారుచేసింది. కె.యర్రంనాయుడు, టి.దేవేందర్గౌడ్, కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, కె.అచ్చన్నాయుడు, ఎంపి కె.రామ్మోహన్నాయుడు తదితరులు టిడిపిలోనే ఉన్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లను రాబట్టుకోవడంతోపాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 80 శాతం కేబినెట్ బెర్త్లు ఇచ్చేలా కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయాలని జగన్ మోహన్రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ, బీసీలు కూడా టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లోకి వెళ్లారని, 2024 ఎన్నికల్లో ఓటర్ల వలసలు ఎక్కువగా ఉంటాయని 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. అయితే, బీసీలకు కేబినెట్ బెర్త్లు బాగానే దక్కినందున వైఎస్ఆర్ కాంగ్రెస్కు పట్టం కడతారా అనేది పెద్ద ప్రశ్న. టీడీపీ తన ఓట్లను నిలుపుకుంటుందా అనేది ఎన్నికల్లో చూడాలి.