కాపుల ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న “అదృశ్య హస్తం ” బయట పడింది. కాపు రాజకీయ నాయకులలో పెరిగిన కార్యకలాపాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి , కాపు సామాజికవర్గం సమావేశాల వెనుక టిడిపి ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు మొత్తం ప్లాన్ వెనుక మరో పార్టీ ఉందని తేలింది.
కాపు ఉద్యమాల్లో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..అకస్మాత్తుగా యాక్టివ్గా మారిన వారంతా వైఎస్సార్సీపీయేతర నేతలే.వారు సాధారణంగా టీడీపీ అధిష్ఠానానికి దగ్గరగా ఉంటారు.అయితే కాపులను ఏకతాటిపైకి తీసుకురావడానికి చాలా మంది అదృశ్య నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.గంటా శ్రీనివాసరావు,బోండా ఉమా మహేశ్వరరావు,మాజీ డీజీపీ రామ్మోహనరావు వంటి నేతలు తెర ముందు కనపడుతున్నారు అని,తెర వెనుక పని చేసే వేరే ఉన్నారని అంటున్నారు.అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం వీరంతా బీజేపీ వారే.
బీజేపీకి సాయం చేసేందుకు ఈ నేతలు కాపు కార్డు వాడాల నుకుంటున్నారు.ఈ వ్యక్తుల వాదన ఏమిటంటే,రెండు ప్రముఖ సామాజిక వర్గాలు కమ్మ,రెడ్డి వరుసగా టిడిపి, వైఎస్సార్సిపి ద్వారా అధికారాన్ని చేపట్టాయి.అందువల్ల సంఖ్యాపరంగా బలమైన రాజకీయంగా అసంఘటిత కాపులపై బిజెపి దృష్టి పెట్టాలి,ఇది బిజెపి ఆలోచనా పెద్దల వాదన.
అందుకే సాధారణంగా వినిపించే ముద్రగడ పద్మనాభం వంటి పేర్లు తప్పుతున్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గత వైఫల్యాలకు తావివ్వని కొత్త కాపు నాయకులను ఉద్యమానికి నాయకత్వం వహించాలన్నారు. అందుకే గంటా నాయకుడిగా ముందున్నారని విశ్లేషకులు అంటున్నారు.